ఎందుకు అంత ఓవరాక్షన్, దీన్నే అతి అంటారు’ అంటూ దారుణంగా ట్రోల్ చేసారు. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల వరకు రష్మికను ఫ్యాన్స్, నెటిజన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్ అయిందో అప్పటినుంచి రష్మిక అంటే చిరాకుపడుతున్నారు. ఇందుకు కారణం సినిమాలో ఆమె చేసిన ఓవరాక్షనే అట. సరిలేరు నీకెవ్వరు సినిమా చూసాక పబ్లిక్ టాక్లోనూ కొందరు వ్యక్తులు రష్మిక ఓవరాక్షన్ వల్ల సినిమా పోయేలా ఉందని డైరెక్ట్గానే ఎటాక్ చేసారు. అయితే రష్మిక తెలుగులో నటించిన ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వరకు ఆమెను తెలుగు ఆడియెన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు.
కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్ అయిన అనంతరం ఆమెకు నెగటీవ్ ఇమేజ్ బుల్డ్ అవుతోంది. మూవీలో మహేశ్ సరసన ఈ భామ ఓవరాక్షన్ చేసిందని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమా చూసిన చాలామంది పబ్లిక్ టాక్లోనూ ఇదే ఒపినియన్ను వ్యక్తపరిచారు. ఈ కామెంట్స్పై స్పందించిన రష్మిక మూవీలో తన క్యారెక్టర్ని దర్శకుడు అలా డిజైన్ చేశాడని..ఓ నటిగా పాత్రకు తగినట్లుగా ఫెర్ఫామ్ చెయ్యడం తన వృత్తిగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ బెంగుళూరు బ్యూటి అల్లు అర్జున్కు జోడీగా ‘ఐకాన్’ సినిమాలో నటిస్తున్నారు. రష్మిక వరస షూటింగ్స్ ఉండటంతో ఆమె ఎయిర్పోర్ట్ల వద్దే ఎక్కువ కనిపిస్తున్నారు.
తాజాగా ఆమె హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సందడి చేశారు. అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే.. రష్మిక డ్యాన్స్ చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రష్మికపై మండిపడుతున్నారు. రెండు హిట్లు వచ్చినంత మాత్రన అంత ఓవరాక్షన్ అవసరమా అని కామెంట్లు పెడుతున్నారు.
WATCH VIDEO:
Add Comment